SRCL: గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.