RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీ 2, 8, 18 వార్డులలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందే మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ ప్రజలకు గర్భాశయ క్యాన్సర్పై వివరించారు. ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.