SRPT: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కాకతీయ హైస్కూల్, జడ్పీహెచ్ఎస్ కేంద్రాలను ఎస్పీ నరసింహ ఐపీఎస్ పరిశీలించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, మైకులు వాడరాదని ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక ఎస్సైలు ఉన్నారు.