MNCL: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. మొత్తం బడ్జెట్ 3,21,234 కోట్లు కాగా.. బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.