ELR: దేశవ్యాప్తంగా అనేక వివక్షలు ఎదుర్కొన్న దళితులపై నేటికీ దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దళితులకు రక్షణ కల్పించవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సవరిస్తూ దళితుల రక్షణను ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఆరోపించారు.