MNCL: మందమర్రి పట్టణంలోని ఐటీఐలో ఏఎంకేయూవై 4.0 స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దేవానంద్ ప్రకటనలో తెలిపారు. కోర్సు కాల పరిమితి మూడు నెలలు ఉంటుందన్నారు. మార్చి 2 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.