NLG: తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తన సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల జి.ప.ఉ. పాఠశాలలో టెన్త్ పరీక్ష ఫీజు కట్టలేని 39 మంది విద్యార్థుల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు. హెచ్ఎం సుశీల, ఉపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్, నర్రా సరళ పాల్గొని సంజయ్ దాస్ సేవలను అభినందించారు.