NZB: కమ్మర్పల్లికి చెందిన బొడ్డు సుజాత న్యూరో సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల ఎల్ఎసీ పత్రాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో ఆర్థికసాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.