ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఆదేశించారు. గురువారం ఉట్నూర్లోని క్యాంపు కార్యాలయంలో డీటీడీఓ, ఏటీడీవోలు, హెచ్డబ్ల్యుఓల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణపై కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.