KNR: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు చేపట్టి రాకేష్ రెడ్డి, విజయ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.