BPT: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.50 లక్షల CSR నిధులతో నిర్మించిన నూతన కాపు కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ భవనం కాపు సామాజికవర్గ వివాహాలు, ఆత్మీయ సమావేశాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.