MBNR: పాలమూరు యూనివర్సిటీలో పీజీ III సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) ఫలితాలను వీసీ ప్రొ జి.ఎన్. శ్రీనివాస్ విడుదల చేశారు. మొత్తం 1285 మంది విద్యార్థులకు గాను 1019 మంది (79.29%) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంబీఏలో 83.75%, ఎంసీఏలో 88.23% పాస్ శాతం నమోదైంది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రో. రమేష్ బాబు, కంట్రోలర్ డా కె ప్రవీణ, అధికారులు పాల్గొన్నారు.