ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జీ.దేముళ్లు అన్నారు. ఈగల్ టీమ్, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.