KRNL: పర్యావరణ పరిరక్షణలో ప్రతి వ్యక్తీ తన బాధ్యతను గుర్తించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఇవాళ దుపాడు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రపంచ భూమి దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నీటి ఆదా, విద్యుత్ వినియోగం తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం అవసరమని తెలిపారు.