ASR: బీజమరవలసలో ఈనెల 18న నాటు తుపాకీతో మహిళలపై కాల్పులు జరిపిన నిందితుడు లక్ష్మణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాఫీ తోటకు నిప్పు పెట్టారన్న అనుమానంతో బీమలమ్మ (53),ఆమె కుమార్తె శిరీషా (16)పై కాల్పులు జరపడంతో ఇద్దరూ గాయపడ్డారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై ఎల్.సురేష్ ఇవాళ తెలిపారు.