మార్కాపురం నియోజకవర్గంలోని 102 చెరువులను బాగు చేసి వాటిని వచ్చే వర్షాకాలంలో నీటిని నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులకు ఆదేశించారు. మంగళవారం మార్కాపురం కలెక్టరేట్లో ‘జలధార జలహారతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే భూగర్భ జలాలను పెంచాలన్నారు.