పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న అధునాతన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆసుపత్రిలో నవజాత శిశు సేవలు, 2 డి ఎకో, లాప్రాస్కోపిక్ శస్త్ర చికిత్సలు, యూరాలజీ మరియు రూట్ కెనాల్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సేవలలో ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.