బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ‘శిరో రక్ష–ప్రాణ రక్ష’ కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. ఏప్రిల్ 16 నుంచి బాపట్లలో హెల్మెట్ నిబంధన కఠినంగా అమలు చేస్తామన్నారు. అప్పటి వరకు వాహనదారులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు.