PDPL: మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదారి సాహిత్య సీఎం కప్ టోర్నీలో గురువారం రెండు పథకాలతో మెరిసింది. సిద్దిపేటలో నిర్వహించిన 2025- 26, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-15, 10 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్, 20 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్ పథకాలతో రాణించిందని కోచ్ మ్యాక్స్ వెల్ ట్రావర్ పేర్కొన్నారు. ఆమెని పలువురు అభినందించారు.