BHPL: మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో రేపు హుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎస్.మహేశ్ తెలిపారు. బుధవారం ఉదయం 10గంటలకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఆసక్తి గల భక్తులు, గ్రామస్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఈలెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆయన కోరారు.