RR: మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు.