PLD: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య విస్తరణకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.