HYD: రూ. 5 వేలు పెట్టుబడి పెడితే గంటలోనే రూ. 25 వేలు లాభం వస్తుందని “స్టాక్ మార్కెట్ తెలుగు ట్రేడర్ గ్రూప్”పై సైబర్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు అలాంటివి నమ్మొద్దని, ఇలాంటి ఫేక్ ట్రేడింగ్ గ్రూపులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్నాయని పోలీసులు హెచ్చరించారు. అధిక లాభాల పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దన్నారు.