SRCL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’లో భాగంగా గురువారం ఇల్లంతకుంటలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. కలెక్టర్ కరీమా అగర్వాల్ స్వయంగా హాజరై రేషన్ డీలర్ల ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.