KMM: ప్రతిపాదిత ఆర్వోఆర్ రైల్వే లైన్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కామేపల్లి, డోర్నకల్ మండలాల రైతులు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించారు. గరిడేపల్లి, అమ్మపాలెం, బంజర గ్రామాల మీదుగా లైన్ వేస్తే తమ విలువైన సాగు భూములు పోతాయని, తద్వారా జీవనాధారం కోల్పోతామని వివరించారు. రైల్వే ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు.