VKB: జిల్లాలో పరీక్షల సమయంలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కీలక చర్యలు చేపట్టింది. సీబీఎస్ఈ (CBSE) తరహాలో పరీక్షల మధ్య విరామ సమయాన్ని పెంచారు. ఈ గ్యాప్లో విద్యార్థులు బడికి వచ్చేలా ప్రోత్సహిస్తూ, వారిని పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు ప్రతిరోజూ మూడు ప్రత్యేక పీరియడ్లను కేటాయించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) రేణుకాదేవి తెలిపారు.