జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన 14వ వార్డు కౌన్సిలర్ బొల్లారపు స్వప్న గిరిధర్, డీఎస్పీ రఘుచంధర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశం జగిత్యాల పట్టణంలో జరిగింది. ఈ కలయికలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.