NRPT: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఈనెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు లేదా బహిరంగ సభలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.