NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ ముగిసింది. గత నెల 24 నుంచి కొనసాగిన తనిఖీల్లో భాగంగా నేడు గ్రామ సభ నిర్వహించారు. అధికారులు పనులను పరిశీలించి ప్రజలకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ మహేందర్, కార్యదర్శి సరిత, ఎఫ్ఏ, వార్డు సభ్యులు, కారోబార్ పాల్గొన్నారు.