JGL: పేదల సంక్షేమానికి అండగా ఉండడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలకు చెందిన సునీత నరాల వ్యాధితో బాధపడుతూ.. చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం సహాయ నిధి నుంచి రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు చేసి కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రభుత్వం పేదల వైద్య అవసరాల కోసం సహాయం అందిస్తోందని, అర్హులైన వారు పథకాలను వినియోగించుకోవాలన్నారు.