KNR:మానకొండూరు మండలంలోని వెల్ది గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 ట్రిప్పుల ఇసుకను శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీలత, తహశీల్దార్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. గుర్తించిన ఇసుకను పంచనామా చేసి, భద్రత నిమిత్తం జీపీఓ స్వాతికి అప్పగించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.