WGL: చైత్రమాస వసంత రుతువు సందర్భంగా భద్రకాళి దేవాలయంలో ఇవాళ విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో తెల్లవారుజామునే సుప్రభాత సేవలతో ఆలయ ద్వారాలు తెరిచి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. వేద పండితులు అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.