ఇండియన్ ఓపెన్ పికిల్బాల్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఏప్రిల్లో ఈ టోర్నీ నిర్వహిస్తామని భారత పికిల్బాల్ సంఘం వెల్లడించింది. గత మూడు సీజన్లలో 19 దేశాల నుంచి నాలుగు వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపింది. ఈసారి 56 విభాగాల్లో మొత్తం 1500 మంది పోటీపడతారని పేర్కొంది.