KDP: జిల్లాలో గ్యాస్ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జేసీ మీనా తెలిపారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, వినియోగదారులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని చెప్పారు. అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.