SRD: గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ సూరారంకు చెందిన అడవి వీరేష్ (45) మామిడి కాయలు తెంపేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్లో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.