NLG: ఎండలు తీవ్ర రూపం దాల్చకముందే చిట్యాల మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా 8,9 వార్డుల్లో ఇళ్లలోకి సరిగా నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయా వార్డు కౌన్సిలర్లు కుక్కల మోహన్, ఏర్పుల పరమేష్ వెంటనే స్పందించి ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అధికారులు పరిస్థితిని గుర్తించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.