GNTR: గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. తన్నీరు శ్రీనివాసరావు శుక్రవారం ఫిరంగిపురం మండలంలో పర్యటించారు. పొనుగుపాడు గ్రామంలో పశువుల గాలికుంటు వ్యాధి నిర్ధారణ కోసం రక్త నమూనాలను సేకరించే ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డా. షేక్ పీర్ అహ్మద్ పాల్గొన్నారు.