NLG: చిట్యాల పురపాలక సంఘం పరిధిలోని రైతులకు మేలు చేకూర్చేలా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) పక్కన కూరగాయలు, పండ్ల దుకాణాల సముదాయాన్ని నిర్మించాలని చిట్యాల రైతు సంఘం కోరింది. ఈ మేరకు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జానయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. హైవేపై మార్కెట్ నిర్మిస్తే స్థానిక రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.