JN: ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కోరుతూ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి దశమంత్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలను అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ప్రజా సంక్షేమంపై శ్రద్ధ చూపించాలన్నారు.