PLD: మాచర్ల మండలం రేగులవరం తండాలో కొలువుదీరిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ సేవాలాల్ స్వామి వార్ల ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా జీవ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవ క్రతువును స్వయంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.