NLG: గుడిపల్లి మండల కేంద్రంలో సంఘసంస్కర్తలు, మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ప్రతిష్టాపన కోసం శుక్రవారం “విగ్రహాల నిర్మాణ కమిటి” ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, విగ్రహాల దాతలు మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి, ఇటికాల జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటి డైరక్టర్ భూతం సైదులు ఉన్నారు.