SRCL: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పట్టణ మున్సిపాలిటీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలను వంద శాతం వసూలు చేయాలని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో ఛైర్మన్ మాట్లాడుతూ.. నెలాఖరు వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలన్నారు.