ప్రకాశం: రంజాన్ పర్వదినం సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసం, దైవారాధన, దానధర్మాలు, మానవ సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం తీసుకురావాలని ఆకాంక్షించారు.