BDK: గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్మానాయక్, శ్రీరామ్ నాయక్ అధ్యక్షతన శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాటోతు ఠాను నాయక్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, గిరిజన బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీశాలి ఠాను నాయక్ అని ఆయన కొనియాడారు.