KMR: గడిచిన 24 గంటల్లో జిల్లాలో అకాల వర్షం కారణంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. అధికారిక వెల్లడి ప్రకారం.. మద్నూర్ మండలం సోమూరు 15.3మి.మీ, అత్య ధిక వర్షపాతం నమోదు కాగా, పాత రాజంపేట 12.8, భిక్కనూరు 8.5, జుక్కల్ 6.8, దోమకొండ 5.3, ఎల్పుగొండ 4.3మి.మీ లుగా వర్షపాతం నమోదైందని తెలిపారు.