KMM: ఖమ్మం డిపో నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఎం శివప్రసాద్ తెలిపారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి బయలుదేరే ఈ బస్సు శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వాడపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసుకు పెద్దలకు రూ. 900, పిల్లలకు రూ. 470గా రాను-పోను చార్జీ నిర్ణయించారు.