కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని 13వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండారు సత్యనారాయణ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. వైద్యం, మందుల ఖర్చుల కోసం రూ.10,000 చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందించారు.