సత్యసాయి: తనకల్లు మండలం మండ్లిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న పత్తి లారీ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స కోసం తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.