W.G: నరసాపురానికి చెందిన ప్రముఖ కళాకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. శిల్ప, చిత్ర, సూక్ష్మ కళా రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికిగాను విజయవాడలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. గతంలో గిన్నిస్ రికార్డు సాధించిన విజయ్ మోహన్ను పలువురు ప్రముఖులు అభినందించారు.