SRPT: నడిగూడెం మండలంలోని కరివిరాల గ్రామానికి చెందిన ఉషారాణికి మంగళవారం కేంద్ర ప్రభుత్వ ‘పీఎం విశ్వకర్మ’ పథకం కింద టైలరింగ్ మెషిన్, టూల్ కిట్ను అందజేశారు. పోస్టల్ శాఖ ప్రతినిధి కావ్య, గ్రామ సమన్వయకర్త వంగూరు రమేష్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారురాలికి మండల బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల నాగరాజు అభినందనలు తెలిపారు.